యువగళం ముగింపు సభకు తరలి రండి

గజపతినగరం: జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ మంగళవారం ఐదు మండలాలు నాయకులు కార్యకర్తలు వీరమహిళతో సమావేశం ఏర్పాటు చేసి, 20వ తేదీ బుధవారం జరగబోయే యువగళం పాదయాత్ర ముగింపు సభకు నియోజవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో జనసైనికులు నాయకులు, కార్యకర్తలు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని తెలిపారు. ఈ సభకు నియోజవర్గం నుంచి బస్సు ఆటోలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు, జనసేన మండల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.