ఏదేమైనా పవన్ కళ్యాణ్ వెంటే మా పయనం

నెల్లూరు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుంటాం అంటూ వెంగల్ రెడ్డి పల్లిలో జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గాల్లో అధ్యక్షులు ఆశయాలని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్న యువతని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రేపటి భవిత కోసం కష్టపడగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ ని నమ్మి వస్తున్న యువతకు అభినందనలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పరచుకున్న పొత్తుకు మద్దతు తెలిపి మీ ఓట్లే కాకుండా వారి చుట్టుపక్క వాళ్ళని ప్రభావితం చేసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాల్సిందిగా పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర రాష్ట్రంలో కీలక సమస్యలను పరిష్కరించే దిశగా సూపర్ సిక్స్ గ్యారంటీలు ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, వెంకటగిరి నియోజకవర్గం, వెంగల్ రెడ్డి పల్లిలో జనసేన, తెలుగుదేశం, బిజెపిల ఉమ్మడి అభ్యర్థి కురుగొండ లక్ష్మీ ప్రియని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అంటూ స్థానిక జనసేన నాయకులు హరి, రాధమ్మ, తోట కృష్ణయ్య మరియు ఇతర జనసేన తెలుగుదేశం నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.