దొంగ ఓట్లను తొలగించండి – కలెక్టర్ కు జనసేన వినతి పత్రం

తిరుపతి నియోజకవర్గం: తిరుపతి నియోజకవర్గంలో చాలా వరకూ దొంగ ఓట్లు వున్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని జనసేన పార్టీ తరుపున నగర అధ్యక్షుడు రాజారెడ్డి మరియు హేమకుమార్, కొండా రాజమోహన్, మునస్వామి, రాజేష్ ఆచారి, లక్ష్మి, చందన, దుర్గాదేవి, గుట్టా నాగరాజు, హేమంత్, పురుషోత్తం, కిషోర్, మనోజ్, షరీఫ్, ఆది, వంశీ, రమేష్, విశ్వ, బాషా తదితరులతో కలిసి కలెక్టర్ వెంకటరమణ రెడ్డిని కలిసి మంగళవారం వినతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, దొంగ ఓట్లుపై సమగ్ర విచారణ జరిపించి, తగిన చర్యలు చేపట్టి దొంగ ఓట్లను తొలగిస్తామని జనసేనకు హామీ ఇవ్వడం జరిగింది.