ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ 6వ రోజు జనసేన విజయ యాత్ర

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ .. జనసేన విజయ యాత్ర 6వ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం, కైలాస గిరి కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరిస్తూ, వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరిస్తూ, పథకాల పేరిట వైసీపీ చేస్తున్న దోపిడీని ప్రజలు వివరించడం జరిగింది. కైలాసగిరి కాలనీలో కనీసం త్రాగడానికి నీళ్ళు ఇవ్వలేదని, స్ట్రీట్ లైట్లు వెయ్యలేధని, డ్రైనేజ్ కాలువలు నిర్మాణం లేదని ప్రజలు తెలిపారు. ఒక్క అవకాశం అని ఓటు వేస్తే మహిళలకి జగన్ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమస్యలను అధికారుల దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్తామని ప్రజలకు వినుత తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, వీర మహిళలు, రాజ్య లక్ష్మి, లక్ష్మి, శారద, పుష్ప, కవిత, బతెమ్మ, దేవి, జయంతి, నాయకులు దినేష్, గురవయ్య, ఉదయ్, శ్రీరామ్ జనసైనికులు బబ్లూ, చిన్న మునయ్య, శబరి, రాజేష్, మదు, శీను, హేమంత్, వెంకీ, భాను, ఈశ్వర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.