దుర్గా శక్తి మహిళా విభాగ అధ్యక్షురాలిగా కుప్పాల జ్యోతి నియామకం

అనంతపురం: హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దుర్గా శక్తి మహిళా విభాగ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షురాలిగా కుప్పాల జ్యోతిని నియమించినట్లు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నూలు బసవరాజు, ప్రధాన కార్యదర్శి పిల్లాడ రుద్రయ్య ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొప్పాల జ్యోతి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఆమె రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారని అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లా కాపు అధ్యక్షురాలుగా కూడా ఆమె కొనసాగుతున్నారని నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ఎక్కడ అన్యాయం జరిగినా ఆమె దృష్టికి వచ్చిన దుర్గా శక్తి మహిళా విభాగము తరఫున ఖండిస్తానని ఆమెతెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నందు గతంలో రాడికల్ సిద్ధాంతం కలిగిన, నాస్తిక వాదాన్ని నమ్మినటువంటి కరుణాకర్ రెడ్డిని వెంకటేశ్వర స్వామిని అది నల్లరాయే దానివల్ల ఏమి ఉపయోగం లేదు అన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క వైయస్సార్సీపి ప్రభుత్వం ఎందుకు నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక బ్యాంకు లాగా ఉపయోగించుకుంటున్నారు. ఏదైతే హిందూ ప్రజలు నమ్మి హుండీలో మనసా వాచా కర్మణా భగవంతుడికి చేరాలని కానుకలు వేస్తున్నారో ఆ నిధులను రెవెన్యూ ద్వారా ప్రభుత్వ పథకాలకు మళ్లించే హక్కు మీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు. దీనికి సంబంధించిన జీవో కాపీస్ కూడా ఆన్లైన్లో పెట్టడం లేదు, ఎందుకంటేదానిపై కోర్టుకు వెళ్లకుండా ఉండడం కోసం కప్పి పుచ్చేతున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వం హిందువులకు కచ్చితంగా సంజయ్సీ చెప్పాలి. తక్షణమే ఈ నాస్తికుడైన కరుణాకర్ రెడ్డిఫై తగిన చర్యలు తీసుకోవాలి. గతంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయల గారి ఆభరణాలు కరిగించినట్లు అభయోగం కూడాఆయన పైన ఉంది. ఏ విధమైన భయం భక్తి లేని వ్యక్తిని నియమించి ప్రభుత్వ బ్యాంకు గా ఉపయోగించుకున్నటువంటి వైయస్సార్సీపి ప్రభుత్వానికిఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. గతంలో కూడా ఏడుకొండలు రెండు కొండలు అన్నటువంటి వ్యక్తికి ఏ విధమైన శాస్తి జరిగిందో భక్తులందరికీ తెలుసు ఒక్కసారి గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి, అదే తరుణంలో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కచ్చితంగా మీకు బుద్ధి చెబుతారని ఆమె తెలియజేశారు.