తూర్పుగోదావరి జిల్లాలో మరో మూడు మండలాలకు అధ్యక్షుల నియామకం

తూర్పుగోదావరి జిల్లాలో మరో మూడు మండలాలకు అధ్యక్షుల నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. జిల్లాలో 64 మండలాలు ఉండగా 53 మండలాలకు ఇప్పటికే అధ్యక్షుల నియామకం పూర్తయింది. సఖినేటిపల్లికి గుబ్బల ఫణికుమార్, మలికిపురానికి మల్లిపూడి సత్తిబాబు, రాజోలుకు సూరిశెట్టి శ్రీను మండలాధ్యక్షులుగా నియమితులయ్యారు.