తెలంగాణ జనసేన పర్యవేక్షణ కమిటీ నియమించిన నేమూరి శంకర్ గౌడ్
- తెలంగాణ ఎన్నికల కసరత్తులో భాగంగా కార్యనిర్వాహకులను పర్యవేక్షించేందుకు 7 మంది సభ్యుల కమిటీ నియామకం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసినదే. పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఇటీవల 32 నియోజకవర్గాలలో కార్యనిర్వాహకులను నియమించడం జరిగింది. వీరంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలలో పర్యటిస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. కార్యనిర్వాహకులకు సహకారం అందిస్తూ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకుగానూ 7 మంది ముఖ్య సభ్యుల బృందాన్ని నియమిస్తున్నామని, కార్యనిర్వాహకులు ముఖ్య సభ్యులు సమ్యుక్తంగా నివేదిక తయారు చేసి పార్టీ పెద్దలకు అందజేస్తారని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు.
పరిశీలన బృంద ముఖ్య సభ్యులు
- రాధరం రాజలింగం
- మేకల సతీశ్ రెడ్డి
- చిన్న మాధిరెడ్డి దామోదర్ రెడ్డి
- ఎం.డి సాధిక్ అలీ
- నల్లా సురేష్ రెడ్డి
- రత్న పిల్లా
- తాడికొండ లిఖిత నాయుడు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/sgoud.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-04-at-20.29.39-723x1024.jpeg)