గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన తొమ్మిదివ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, ములలంక పంచాయతీ బట్టిగుడ గిరిజన గ్రామంలో తొమ్మిదవ రోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం జనసేన నాయకుల్లు గ్రామాలలో పర్యటించి జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన జాని మాట్లాడుతూ ఉన్నతమైన వ్యక్తులతోనే వ్యవస్థలో ఉన్నతమైన, ఉత్తమమైన మార్పులు వస్తాయి. ఆ ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆ ఉన్నతమైన వ్యవస్థ ఏర్పాటు చేసేది జనసన పార్టీ అని ఉద్భోదించారు. జనసేన కుటుంబం ఎంత పెద్దదైతే అంత గొప్ప విజయాలు జనసేన పార్టీ సొంతం అవుతాయని తెలియజేసారు. మత్స పుండరీకం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓట్లు, నోట్లు, అధికార వ్యామోహంతో రాజకీయాల్లోకి రాలేదు, మహిళాశక్తిని, యువశక్తిని రాజకీయశక్తిగా మార్చడానికి వచ్చారని తెలియజేసారు. సమాజంలో మార్పు రావాలంటే తుపాకులు, కత్తులు పట్టుకొని యుద్ధం చేయటం కాదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడి అభిప్రాయం చెప్పాలని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలంటే బలమైన సంకల్ప బలం ఉండాలని, ఆ సంకల్పంతో పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ అని తెలిపారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు కార్యకర్తలకు ఓపిక సహనం చాలా అవసరమని, అవమానాలకు ఎదురొడ్డి నిలబడాలని తెలిపారు. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడ్డారు తప్ప. కులాలు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోమ్మలి వినోద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలంటే గ్రామ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని మీ గ్రామఒ వచ్చామని, తెలిపారు. వీర మహిళ సొండి అమలసుమన్ మాట్లాడుతూ మహిళలు అందరూ జనసేన పార్టీకి అండగా ఉందాలని, రాబోయే ఎన్నికల్లో గిరిజన ప్రజల ఓట్లు జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తుకి వేసేవిధంగా ప్రజల్లో మార్పు తీసుకువస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు సొండి సుమన్, బి.పి నాయుడు, కంటు మురళి, దూసి ప్రణీత్, జరజాపు రాజు ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.