ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధి మీద వైసీపీ నాయకులు చర్చకు సిద్ధమా? -తాతంశెట్టి

రైల్వేకోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ సాక్షాత్తు సీఎంతో సహా మంత్రి, విప్ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు ఎవరైనా ఉమ్మడి కడప జిల్లా 10 నియోజకవర్గాలలో ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి మీద శ్వేతపత్రము వదలాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కడప జిల్లాలో ఇసుక, మట్టి, దోపిడీ తప్ప అభివృద్ధిలో ఐరవై సంవత్సరాలు వెనక్కి నెట్టారని ఏద్దేవా చేశారు. పారిశ్రామికంగా హామీలిచ్చిన సీఎం రైల్వే కోడూరు అప్స జ్యుస్ ఫ్యాక్టరీ మొదలు నందలూరు లోకోషెడ్, ఆల్విన్, చెన్నూరు చక్కర కర్మాగారం, ఉక్కు కర్మాగారం మాటలు తప్ప కనీసం వీటివైపు కన్నెత్తి చూడలేదు. స్వార్థ ప్రయోజనాలకు రాజంపేట కాపీటల్ రాయచోటికి మార్చి రాజంపేటను నిర్వీర్యం చేశారు. అన్నమయ్య డ్యాం బాధితుల గోడు వినే నాదుడే లేడు. జిల్లా స్థాయిలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కన్నీటితో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్లు ద్వారా ఎవరికీ ఎంత లబ్ది చేకూర్చారో చెప్పే ధైర్యం ఉందా? ఉమ్మడి జిల్లాలో ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు చూపగలరా? అని నీలాదీశారు. ప్రజలు మీకెందుకు ఓటు వేయాలో ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఒక్క పని చేయని మీరు ఓటు అడిగే హక్కు కోల్పోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు వరికకూటి నాగరాజ, దాసరి వీరేంద్ర పాల్గొన్నారు.