నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జనసేన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, అంబేద్కర్ నగర్ ఒక కుటుంబానికి చెందినఇద్దరు నందిపాటి నాగయ్య నందిపాటి పున్నం అనే వ్యక్తులు అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కనీసం వారి పెద్ద కార్యం చేయడానికి స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారని జనసేన పార్టీ నాయకులకు తెలియజేసి ఏదైనా సహాయం అందించగలరని కోరడం జరిగింది. జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో వారి పెద్ద కార్యానికి తగిన క్వింటా రైస్ వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, మండల సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, పూసగూడెం గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బోడ నాగరాజు నాయక్, దమ్మపేట మండల నాయకులు కాకా రాజేష్ గడ్డం నవీన్, ములకలపల్లి మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎస్ కే జాన్ పాషా, ములకలపల్లి మండల గ్రామ కమిటీ నాయకులు సుద్దాల రమేష్, గోపగాని సాయి ప్రకాష్, అంబేద్కర్ నగర్ కు చెందిన యువకులు గద్దల రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.