పైప్ లైన్ మరమ్మతులను పరిశీలించిన అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు పటణంలోని స్థానిక ధర్మవరం గేట్ రోడ్ నందు గత 5 నెలలుగా ఇబ్బందిగా మారిన పైప్ లైన్ మరమత్తుల సమస్యను గుంతకల్లు నియోజకవర్గం నాయకులు అరికేరి జీవన్ కుమార్ పరిశీలించారు. స్థానిక నివాసులు & వ్యాపారుల వివరాల మేరకు పైప్ లైన్ మరమత్తుల కారణంగా గత ఎన్నో నెలలుగా సమస్యగా మారిన పెద్ద గుంత వల్ల ప్రజలు & వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని, మరియు నడక దారి మార్గంలో వెళ్ళేటపుడు గుంతలో పడిపోయే ప్రమాదం ఉందని, ఇలాగే కొన్ని నెలల క్రితం ఒక్క చిన్న పాప ప్రమాదపు శాత్తు అందులో పడటం జరిగిందని, అదృష్టం కొద్ది ఆ పాపకు ప్రాణాపాయం తప్పిందని మొరపెట్టుకోవడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్ (ఎల్.ఎల్.బి), గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు షేక్ జీలన్ బాషా, యువ నాయకులు అరవింద్ కుమార్, ఆర్.సి సురేష్ కుమార్ (ఎల్.ఎల్.బి), ఈశ్వర్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.