గాజువాక జనసేనలో చేరిన ఆర్యవైశ్య సంఘ మహిళలు

గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజక వర్గం ఇంచార్జ్ కోన తాతారావు నేతృత్వంలో వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘ నాయకులు శ్రీమతి బండారు సీతా మహాలక్ష్మి, మరియు కేసారపు వాణితో పాటు సుమారు 60 మంది ఆర్యవైశ్య సంఘ మహిళలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అశయాలు, సేవాభావం, సామాజిక స్పృ పై ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్బంగా కోన తాతారావు మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధి, మహిళా అభ్యున్నతి చెందాలంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఇందుకు మహిళలు పవన్ మార్గంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన వీర మహిళ శ్రీమతి దాసరి జ్యోతి రెడ్డి అభినందించడం జరిగినది. అలాగే శ్రీమతి కరణం కళావతి, అంజూర్ దీపక్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేసరపు రజనీ, గునిశెట్టి సరిత, 75 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి కోన పద్మ, వీరుబాబు, నీలపు శ్రీనివాస్ రెడ్డి, నీలపు అప్పలరెడ్డి, కొలగాని మహాలక్ష్మి, నడిగట్ల శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.