ఆర్డీవో సమావేశంలో పాల్గొన్న అతికారి దినేష్

రాజంపేట అర్బన్: ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరుతూ ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో పి.మోహన్ రావు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ అన్ని పోలింగ్ స్టేషన్లోనూ మంచి నీరు, విద్యుత్, టాయిలెట్ వంటి మౌలిక వసతులు కల్పించి, ఓటింగుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించి ఓటింగ్ కు సహకరించాలని కోరారు. సమావేశం అనంతరం అతికారి దినేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అణచివేతకు గురయ్యారని తెలిపారు. రానున్న ఎన్నికలలో రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేనకు మద్దతు పలికి జనసేన, టిడిపి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అతికారి దినేష్ తో పాటు జనసేన నాయకులు కోలాటం హరికృష్ణ, బండ్ల నాగరాజ, ముత్యాల చలపతి, రామా శ్రీనివాసులు, కొట్టే శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.