వీరజవాన్లకు ఆత్మకూరు జనసేన పార్టీ ఘననివాళి: నలిశెట్టి శ్రీధర్

పుల్వామా అటాక్ లో వీరమరణం చెందిన 40 మంది జవాన్లకు సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నందు జనసైనికులతో కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ.. పుల్వామా అటాక్ లో40 మంది జవాన్లు వీరమరణం చెందడం ఇప్పటికీ తలుచుకుంటుంటే మనసు కలిచివేస్తుందని, ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. స్వర్గాదపీ గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా.. అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, జనసైనికులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.