Razole: విద్యార్ధులపై దాడి సంఘటన బాధ్యుల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

అనంతపురంలో తమ ఎయిడెడ్ కళాశాలలను మూసివేయద్దు అని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై ఆడపిల్లలు అని కూడా చూడకుండా పోలీసులతో తలలు పగల కొట్టిస్తారా!

పోలీసుల చేతిలో విద్యార్థులు గాయపడటం దురదృష్టకరం… ఇటువంటి నిరంకుశత్వ తీరు ప్రభుత్వం మనుగడకే ప్రమాదం

ఈ సంఘటనపై బాధ్యుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన తరపున తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం జనసైనికుడు కుంచే శ్రీవాసరావు(పండు) డిమాండ్ చేస్తున్నారు.