పవన్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు: రాటాల రామయ్య

  • మంత్రి జోగు రమేష్ ఓ రాజకీయ అజ్ఞాని
  • జగన్మోహన్ రెడ్డి మెప్పు పందేందుకే పవన్ పై విమర్శలు
  • పవన్ కళ్యాణ్ పై విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి
  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మంత్రి జోగి రమేష్ ఓ రాజకీయ అజ్ఞాని అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకే వైసిపి మంత్రులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య తెలిపారు. బుధవారం సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రి జోగి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనవసర వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. జోగి రమేష్ రాజకీయ ఓ అజ్ఞాని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏ పార్టీ మారలేదని పవన్ కళ్యాణ్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా స్వలాభం కోసం పార్టీ మారలేదన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి శవాన్ని ముందర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మంత్రులతో సంతకాలు చేయించుకున్న నీచ రాజకీయ చరిత్ర మీదన్నారు.కుంభకోణాలతో స్వలాభం కోసం మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసుల నుంచి బయటపడేందుకు నిరంతరం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ, ఏపీ అభివృద్ధిని విస్మరించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో కౌలు రైతులను ఆదుకున్న గొప్ప మానవతావాదన్నారు. అలాంటి గొప్ప నాయకుడిని విమర్శించడం. వైసిపి మంత్రులు మానుకోవాలన్నారు. వైసిపి మంత్రులు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు రూపంలో తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఇప్పటికైనా వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు మాని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.