ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోండి

  • 35 జీవోను రద్దు చేసిన హైకోర్టు
  • హర్షం వ్యక్తం చేసిన జనసేన జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల

సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 35ను హైకోర్టు రద్దు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు అని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల అన్నారు. మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్ళు
జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే అన్నారు. ఉన్నతమైన న్యాయస్థానాలు చివాట్లు, ముట్టికాయలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. ప్రజలు అనేక సమస్య సతమతమౌతుంటే, జగన్‌ రెడ్డి మాత్రం నియంత పాలన సాగిస్తున్నారన్నారు. అన్ని పథకాలు అవినీతిమయం, అభివృద్ధి శూన్యం, రహదారులు, రోడ్లు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇలా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు తీర్పులుతోనైన బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడక తప్పదని జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య వికాస విభాగం కార్యదర్శి పొక్కింగారి రాజు హెచ్చరించారు.