బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ పై అవగాహనా సదస్సు

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న షాదీ మందిర్ నందు సోమవారం నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న జనసైనికులకు, జనసేన నాయకులకి లీగల్ సెల్ మీద అవగాహన కల్పించారు. కొన్ని సూచనలను సలహాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీ నాయకుల బెదిరింపులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, గ్రామాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, చట్టపరమైన న్యాయబద్ధమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ జనసేన సైనికులలో ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చే విధంగా కార్యచరణ, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి. అధికార పార్టీ నాయకుల ఎత్తుగడ్డలకి ఏవిధంగా దీటుగా ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. జనసైనికులకు, జనసేన పార్టీ నాయకులకు మద్దతుగా లీగల సెల్ ఉంటుందని, జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనీ, ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ఖాజా, శ్రీహరీ, అక్బర్, అశోక్, సంజు రాకేష్, వంశీ, సాయి, జాన్, కార్తీక్, శ్రీను, కిరణ్, దినేష్, చందు, రియాజ్, గోవర్ధన్, హరి, కళ్యాణ్, పవన్, ప్రసాద్, అశోక్, మదన్, గురవయ్య, సురేష్, హరీష్, పండు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.