పితాని చేతుల మీదుగా అయినవిల్లి జ్యోతికి ఆర్ధికసాయం

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అమలాపురం ఆకాశం హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొందుతున్న కర్రివారేవు జాంబవని పేట కాపురస్తులు అయినవిల్లి జ్యోతిని పరామర్శించి హాస్పిటల్లో యాజమాన్యం మరియు డాక్టర్లను సంప్రదించి పేషెంట్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరియు వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ శ్రేణులు సేకరించిన విరాళం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గం ఇన్చార్జి పితాని బాలకృష్ణ చేతుల మీదుగా 60,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లకోటి వెంకన్నబాబు, అయినవిల్లి రామారావు, దూడల స్వామి, గేదెల స్వరూప్, వంగ విజయ సీతారాం, పెన్నాడ శివ, జయను లక్ష్మణ్, రాయపు రెడ్డి సిద్దు, తొలేటి గోపి, యార్లగడ్డ బాబ్జి, గొల్లకోటి సాయిబాబు, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.