బి గోనగపుట్టుగా గ్రామంలో క్రియాశీల సభ్యత కిట్ల పంపిణీ

ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం, బి గోనగపుట్టుగా గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన క్రియాశీల సభ్యత కిట్లు పంపిణీ కార్యక్రమం, ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి రాజు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం తీసుకోవడం తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క జన సైనికుడు ఈ సభ్యత్వ నమోదు చేసుకొని ముందుకు వెళ్లాలనే కోరడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సుమారు 5 వేల మంది జనసైనికులు సభ్యత్వం నమోదు చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, కంచిలి జనసేన జడ్పిటిసి అభ్యర్థి డొక్కరి ఈశ్వరరావు, కుసుంపురం జనసేన సర్పంచ్ అభ్యర్థి సురేష్ కుమార్, మున్సిపాలిటీ 10 వ వార్డ్ ఇంచార్జ్ భాస్కర్ రావు, మరియు గ్రామస్తులు జనసైనికులు. సాగర్, దివాకర్, రామకృష్ణ, మనోజ్, ప్రదీప్, రాజశేఖర్, దేవా, హేమ చలపతి, శశి, బడే రాజు, రాజ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.