బి. ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తన సొంత స్వగ్రామం నందు గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతదేశ ఔనత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారత స్వతంత్ర సమరయోధుడు దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ బి. ఆర్. అంబేద్కర్ అని ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదని భారతదేశం గర్వించదగ్గ భరతమాత ముద్దుబిడ్డ అని మరియు నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చింది కుడా ఆయన పెట్టిన బిక్షేనని డాక్టర్ శ్రీధర్ అన్నారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నవ యువ అంబేద్కర్ లా పని చేస్తున్నారు. కాని ఈరోజు చూస్తుంటే కళ్యాణ్ ని ఒక కులానికో మతానికో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ అంబేద్కర్ ఆశలను ఆశయాలను ముందుకు నడిపించే విధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని చెప్పిన డాక్టర్ పిల్లా శ్రీధర్ ఈ కార్యక్రమంలో భాగంగా కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీత సూర్యనారాయణ, పిల్లా దినేష్, వాకపల్లి సూర్య ప్రకాష్, బొంతు లచ్చారావు, మాసా పెద్దపత్రయ, మాసా చిన్నపుత్రయ్య, కాపారపు బుల్లి అప్పారావు, మాసా లక్ష్మణస్వామి, పల్లెటి అప్పారావు,బొంతు నాగు, మైలపల్లి రవి, పలివెళ్ల నాని, సోదే రవికిరణ్, పెనుపోతుల వీరబాబు, పల్లెటి జాన్సన్, రవికుమార్, పిల్లకుర్తి ప్రశాంత్, మేరిశెట్టి దొరబాబు, మరియు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది.