రాష్ట్ర నాయకులను కలిసి నూతన శుభాకాంక్షలు తెలిపిన శృంగవరపుకోట జనసేన నాయకులు

శృంగవరపుకోట నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ మరియు శ్రీ బొలిశెట్టి సత్యలను శృంగవరపుకోట జనసేన నాయకులు రామెల్ల శివాజీ, మల్లువలస శ్రీను, గోరపల్లి రవి, సుంకర అప్పారావు మరియు వబ్బిన సన్యాసినాయుడు జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ మరియు నియోజకవర్గ సమస్యలను గురించి చర్చించడం జరిగింది.