పిడుగురాళ్ల పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్ల పంపిణి

గురజాల: పిడుగురాళ్ల పట్టణంలోని 4వ వార్డులో జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను నమోదు చేసి పంపిణి చేయడం జరిగింది. జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కలిగే ప్రయోజనాలను వివరించి, వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, బంకా, సామెలు, కమల్, టీడీపీ 4వ వార్డు బూత్ కన్వీనర్ బూర్స్ శ్రీనివాసరావు, షేక్. బుడే తదితరులు పాల్గొన్నారు.