కనీస వసతలు లేని పాఠశాలలు!.. ఎక్కడ మీ నాడు -నేడు?: బాడిశ మురళీకృష్ణ

కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో గల బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆ స్కూల్ పరిస్థితిని, అక్కడ వసతులు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. దానికి బదులుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు కనీసం టాయలెట్స్ సౌకర్యం కూడా లేదని.. మరియు స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా లేక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాడు – నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పుకుంటూ.. ప్రగల్బాలు పలుకుతున్న వై. సీ. పి ప్రభుత్వం ఎందుకు ఇటువంటి స్కూల్స్ కి నాడు – నేడు కార్యక్రమం ఎందుకు వర్తించటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థులతో పాటు కలిసి కూర్చొని మధ్యాహ్నణం భోజన మెనూను కూడా పరిశీలించడం జరిగింది. అనంతరం మండల ఎడ్యుకేషన్ అధికారితో మాట్లాడి వీలైనంత త్వరగా స్కూల్ కి కనీస వసతలు కల్పించేవిధంగా చూడాలని మండల ఎడ్యుకేషన్ అధికారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-04-16-at-3.21.41-PM-768x1024.jpeg