క్రియాశీలక కార్యకర్తకు భీమా చెక్ పంపిణీ చేసిన బండారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త మద్దింశెట్టి అయ్యప్పకు వైద్యం నిమిత్తం పవన్ కళ్యాణ్ తరుపున పార్టీ మెడికల్ ఇన్సూరెన్స్ నుండి 50 వేల రూపాయల చెక్కును నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యర్రంశెట్టి రాము, సయ్యపరాజు శ్రీనివాసు రాజు, సలాది జేపి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.