జనసేనానికి అండగా జిల్లా కార్యవర్గం, మండలాధ్యక్షులతో సమావేశంలో పాల్గొన్న బండారు శ్రీనివాస్

*తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి హాజరైన జనసేన జిల్లా కార్యదర్శులు.
*జనసేన పార్టీ మండల నూతన అధ్యక్షులతో కలిసి భారీ ఎత్తున సమావేశం.
*దిశానిర్దేశం చేసిన జనసేన పార్టీ జిల్లా రథసారథి కందుల దుర్గేష్.

తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులతో జిల్లా రథసారథి కందుల దుర్గేష్ అధ్యక్షతన, పలువురు జనసేన ప్రముఖ నాయకులు, జనసైనికులు, పలువురు నూతనముగా ఎన్నికైన మండలాల అధ్యక్షుల సమక్షంలో జిల్లా కార్యవర్గము సభ్యులతో, నియోజకవర్గ ఇన్చార్జిలతో, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన రామచంద్రపురం నియోజకవర్గంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా నియమించిన పలు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులకు పలు ముఖ్య సూచనలు సలహాలు ఇస్తూ, ప్రసంగించారు. జిల్లా కార్యవర్గం సభ్యులు మరియు నియోజకవర్గ ఇన్చార్జులు కొత్తగా ఎన్నికైన మండల జనసేన అధ్యక్షులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ… జనసేన పార్టీని, జనసేనాని ఉన్నతమైన ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్నారని, ఎక్కడ ఎలాంటి మచ్చ, మరక లేని నిజాయితీపరుడైన ఏకైక రాజకీయనాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రజల హృదయాలలో ఉన్నారని, ఈ సందర్భంగా పలువురు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జనసేనాని వారి సేవలను కొనియాడుతూ, జనసేనాని లాంటి ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో మనమంతా పని చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నామని, బండారు శ్రీనివాస్ తెలియజేశారు.