డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన బండారు శ్రీనివాస్

భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి వ్యక్తి పుట్టడం! దేశ ప్రజల అదృష్టం! రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళులు! కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్.

ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని గొప్పగా రచించి, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని కలలుగన్న లెజెండ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. సోమవారం వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఘనమైన జోహార్లు.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలోని, కొత్తపేట గ్రామం పాత బస్టాండ్ సెంటర్ నందు ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా, గొప్ప మేధావిగా, మన దేశానికే కాకుండా, భారత రాజ్యాంగాన్ని నిర్మించి, మన రాజ్యాంగం ద్వారా ప్రపంచ దేశాలకు ఆదర్శమైనారని, అంటరానితనం నిర్మూలనకు తీవ్రంగా కృషి చేశారని, సమాజంలో అందరూ సమానమేనని, కుల మత భేదాలు ఉండకూడదని చాటిచెప్పిన మహానేత, మేధావిగా, భారత రాజ్యాంగం ఉన్నంతవరకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ సజీవంగానే ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలతో జనసేన పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని, కులాలు, మతాలు లేని రాజకీయ నాయకులుగా ప్రజల హృదయాలలో నిలుస్తారని, అన్ని వర్గాలను ఆదరించే గొప్ప నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వారికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక దిక్సూచి అని, జనసేన పార్టీకి, జన సైనికులకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎప్పుడు ఆదర్శప్రాయుడని, ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ తెలియజేశారు.