Kothapeta: రైతులకు ధైర్యం చెబుతున్న బండారు తీరు హర్షణీయం

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలో పంట చేను దెబ్బతిన్న రైతుల బాధలను, పలువురు రైతులు కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ, కొత్తపేట మండలం పలివెల శెరేపాలెం గ్రామంలోనూ అదేవిధంగా ఆలమూరు మండలంలోనూ, నర్సిపూడి గ్రామంలోనూ పలు ప్రాంతాల్లో కొత్తపేట నియోజకవర్గ జనసేన నేత బండారు శ్రీనివాస్ జోరు వానలో తడుస్తూ, సుడిగాలి పర్యటన చేస్తూ, దెబ్బతిన్న రైతుల పంట పొలాలను చూస్తూ, రైతులకు ధైర్యం చెబుతూ, వారి అడుగులో అడుగేస్తూ, రైతుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, పంట దెబ్బతిన్న రైతులను ఓదారుస్తూ, ఒకపక్క రైతుల కన్నీళ్లు చూసి చలించిపోతూ, బరువెక్కిన హృదయంతో బండారు శ్రీనివాస్ రైతుల ఆవేదనను రాష్ట్ర జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, అదేవిధంగా ఎకరాకు 30 వేలు నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా రైతులకు ధైర్యం చెప్పారు. పలు సూచనలు చేసి ఉన్నారు.