భారతీయుడు2.. జనవరి నుండీ రెగ్యూలర్ షూటింగ్
కమల్హాసన్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ ఓ సంచలనం. 1996లో వచ్చిన భారతీయుడు సినిమా బ్లాక్బస్టర్గా నిలిచి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. 24 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ చిత్రానికి సీక్వెల్ ఆరంభించారు కమల్-శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్ కూడా ముగించారు. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే బడ్జెట్ సమస్యల వల్ల సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కదనే ప్రచారం మొదలైంది కానీ అది వాస్తవం కాదు. త్వరలోనే నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్స్గా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, అలాగే సిద్ధార్థ్ నటిస్తున్నారు. జనవరిలో రెగ్యూలర్గా షూటింగ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. చెన్నైలో షెడ్యూల్ పూర్తి చేశాక, దేశంలో పలు లొకేషన్స్లో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశాల్లోనూ షెడ్యూల్స్ ఉంటాయని సమాచారం.