పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం: రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో పలు కుటుంబాలను సోమవారం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ర్యాలీ అన్నవరం ఇటీవల అనారోగ్య రిత్యా ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న బత్తుల బలరామకృష్ణ వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చాట్ల గణేష్ కు ఇటీవల ప్రమాదవశాత్తు కాలికి గాయం అయిందని తెలుసుకుని వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.