అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రాజానగరం గ్రామంలో కార్తీకమాసం సందర్బంగా పార్వతీ పరమేశ్వర్లు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వర్లు వారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. పార్వతీ పరమేశ్వర్లు ఆలయ కమిటీ వారు బత్తుల బలరామకృష్ణ ను సాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు, రాజానగరం గ్రామ జనసేన పార్టీ నాయకులు, రాజానగరం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.