రాజానగరంలో దూసుకుపోతున్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, నందరాడ గ్రామంలో బత్తుల బలరామకృష్ణ సమక్షంలో బిసి, ఎస్సి, ఎస్టి సామాజిక వర్గం నుండి 30 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అందరు బలంగా కృషి చేయాలని కోరడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్ళాలని తెలిపారు. టేకుమూడి దుర్గాప్రసాద్, జోగాడ నాని, వాసంశెట్టి అప్పారావు, వాసంశెట్టి సత్యనారాయణ, వాసంశెట్టి కృష్ణ, వాడ్రేవు శ్రీనివాస్, నాలం రాజు, పల్లికొండ సత్తిబాబు తదితరులు పర్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, చిట్టిప్రోలు సత్తిబాబు, అరిగిన రామకృష్ణ, పాము దొరబాబు, అడ్డాల దొరబాబు, సోలా సతీష్, బాదం రమణ, దుర్గ ప్రసాద్, పల్లికొండ శ్రీనివాసు, గోల బుజ్జి, వాసంశెట్టి కృష్ణ, చిక్కిరెడ్డి సత్తిబాబు, గరగ సాయి, టేకుమూడి పండుగ, గుడాల మణికంఠ, గుడాల శ్రీను, మరియు జన సైనికులు వీర మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.