పలుకుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గరగలంపాలెం గ్రామంలో పలు కుటుంబాలను రాజానగరం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గరగలంపాలెం గ్రామంలో మజ్జి పార్వతి తీవ్ర అనారోగ్య రీత్యా అతి తక్కువ వయసులో చనిపోయారు. వారికి భర్త, ముగ్గురు పిల్లలు ఇల్లు లేకుండా ఆదాయం లేక, ఏ విధమైన ఆస్తులు లేకుండా దయనీయ పరిస్థితిలో ఉండటం చూసి చలించిపోయి ₹10,000/- రూపాయలు ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం అందజేసి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గరగలంపాలెం గ్రామంలో కానెం పోసయ్య తీవ్ర అనారోగ్య రీత్యా చిన్న వయసులోనే చనిపోయారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్నారు. వారికి ఇల్లు గానీ ఆస్తులు గాని లేవు. కూలి పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకొంటున్న తరుణంలో వారి పరిస్థితికి చలించిపోయి ₹5,000/- రూపాయలు ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం అందజేశారు.

జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రాయుడు శ్రీను బైక్ యాక్సిడెంటులో కాలర్ బోన్ కి దెబ్బ తగిలి ఆపరేషన్ చేయించుకుంటే వారిని పలకరించి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం కోసం మీకు అండగా ఉంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గరగలంపాలెం గ్రామ నాయకులు రాయుడు వెంకట రామారావు, కురుమళ్ళ సాయి, కుప్పాల నాగు, రేలేసు నరేష్, గోలకోటి వినోద్, గండిపాటి గోవిందు, చెరుకూరి దుర్గాప్రసాద్, పెద్దాడ చందు, పెంటపల్లి సాయి, గొల్లకోటి కొండబాబు, గణేష్, పెంకె నాగ శంకర్, జనసేన సీనియర్ నాయకులు బదిరెడ్డి దొర, కట్ట వెంకన్నబాబు, ఈటి రాజు, కట్ట పోలీస్, కడిమి భార్గవ్, దేవన దుర్గాప్రసాద్ (డిడి), బత్తుల గోపాలకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.