సూర్య రిపోర్టర్ రామకృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన సూర్య న్యూస్ రిపోర్టర్ యాళ్ల రామకృష్ణ నాయుడు తండ్రి యాళ్ల కృష్ణ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, కంచెర్ల విజయ శంకర్, బండి సత్య ప్రసాద్, కొండేటి సత్యనారాయణ, రుద్రం కిషోర్, విగ్నేష్, అడపా శ్రీను, కాత సత్యనారాయణ, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.