మానవత్వం చాటుకున్న బత్తుల

రాజానగరం, కోరుకొండ మండలం, జంభూపట్నం గ్రామానికి చెందిన జనసైనికుడు మిర్యాల సాయికి శనివారం అర్ధరాత్రి కోరుకొండ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు కావడంతో ఈ విషయం తెలిసిన వెంటనే రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని మొట్టమొదటగా కోరుకొండ పిహెచ్సిలో ప్రాథమిక వైద్యం చేయించి, అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం అర్ధరాత్రి పూట రాజమండ్రి సాయి హాస్పిటల్ కు తీసుకువచ్చి డాక్టర్లతో మాట్లాడి, సొంత ఖర్చులతో దగ్గరుండి ఆపరేషన్ చేయించి జనసైనికుడు సాయికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పూర్తిగా కోలుకునే వరకు తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని వారికి ఒక బలమైన నమ్మకం కల్పించిన రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణకి జనసేన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.