రాతి ముఖ మండపానికి భూమి పూజ

తిరుపతి: వికృతమాలలో వెలసియున్న శ్రీ సంతాన సంపద వెంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా నూతన రాతి ముఖ మంటపానికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భూమి పూజ చేశారు. ఆదివారం ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా రాతి మండపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ 24 రాతి స్థంభాలతో నిర్మిస్తున్న మండపాన్ని వచ్చే వైకుంఠ ఏకాదశిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వికృతమాలలో శిధిలావస్థకు చేరుకున్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని జీర్ణోద్దరణ చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కలిగించాడన్నారు. శ్రీవారి ఆశీసులతో పాటు తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ సహకారంతో ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రాతి ముఖ మండపం నిర్మిస్తే ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ పసుపులేటి వెంకట ప్రసాద్ మరియు పసుపులేటి శివప్రసాద్, ముని కృష్ణయ్య, యుగంధర్, గ్రామ సర్పంచ్, గ్రామ పుర ప్రజలు పాల్గొన్నారు.