పల్లె పల్లెకు జనసేన – కెంగువ గ్రామ సమస్యలపై జనసేన వినతి పత్రం

గజపతినగరం నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు మర్రాపు సురేష్ ఆదేశాల మేరకు, సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో గజపతినగరం నియోజకవర్గ కెంగువ గ్రామంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా.. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన రావు, లాలిశెట్టి రవితేజ, రవికుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పెనుమజ్జి ఆదినారాయణ, చింత నారాయణరావు పాల్గొన్నారు.