డాక్టర్ కందులకు జననీరాజనం

  • దక్షిణంలో విస్తృత పర్యటనలు
  • జనసేన బలోపేతానికి కృషి
  • 101వ రోజుకి చేరిన పవనన్న ప్రజాబాట

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి జనం నీరాజనం పడుతున్నారు. ప్రతిచోట ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషిని పలువురు కొనియాడుతున్నారు. ఆయన చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 101వ రోజుకు చేరిన ప్రజల నుంచి ఆదరణ అసలు తగ్గలేదు. ఈ కార్యక్రమంలో భాగంగా 35వ వార్డు కల్లుపాకల ప్రాంతానికి చెందిన పుష్పవతి అయిన అమ్మాయి కల్పనకు వెండి పట్టీలు, పసుపు కుంకుమ అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలు మంచి కోసం తాను చేస్తున్న ప్రతిపనికి అందరి నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రఘు, త్రినాధ్, ఎంపీటీసీ శ్రీనివాస్, మంగశ్రీ, జయ, లలిత,
దుర్గా, కుమారి, కేదారనాథ్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.