ఘనంగా కటకంశెట్టి విజయలక్ష్మీ పుట్టిన రోజు వేడుకలు

గుంటూరు: జనసేన పార్టీ గుంటూరు నగర ప్రధాన కార్యదర్శిగా భాద్యత నిర్వహిస్తూ, గతంలో గుంటూరు నగరంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో 45వ వార్డు నుండి కార్పొరేటర్ గా పోటీ చేసిన కటకంశెట్టి విజయలక్ష్మీ పుట్టిన రోజు సందర్భంగా గురువారం జిల్లా పార్టీ కార్యలయంలో ఘనంగా సన్మానించి, కేక్ కటింగ్ చేయించి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా నాయకులు జిల్లా ప్రధానకార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా నాయకులు చట్టాల త్రినాధ్, బత్తుల కేశవ, తుమ్మల నరసింహా, తన్నీరు గంగ రాజు, యడ్ల రాధిక, కందుల సైదయ్య, ఏపూరి పూర్ణ, సత్యనాయయణ పాల్గొన్నారు.