రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా తాడేపల్లిగూడెంలో రక్తదాన శిబిరం

తాడేపల్లిగూడెం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 37 వ పుట్టినరోజు సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించారు. సుమారుగా 50 మంది రామ్ చరణ్ యువత సభ్యులు రక్తదానం చేసారు. అనంతరం బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మాదిరెడ్డి రమేష్ చంటి అధ్యక్షత వహించారు, జనసేన పార్టీ ఉభయగోదావరి జిల్లాల వీర మహిళా కన్వీనర్ కె మధులత, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు గట్టు గోపి కృష్ణ, జనసేన పార్టీ పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబి, కొనకళ్ళ హరినాథ్, గుండుమోగుల సురేష్, మట్ట రాంబాబు, నల్లగాంచుల రాంబాబు, కర్రి సత్యనారాయణ, మలపాక చిట్టి, సర్పంచ్ శ్రీమతి కోలా శేషవేణి, ఉప సర్పంచ్ శ్రీ కోలా మార్కండేయులు మరియు గ్రామ నాయకులు కోడే కాళి, రుద్రా కాశి, మద్ధూరి సత్యనారాయణ, ఐతం వెంకన్నబాబు, ఏపూరి సాయి మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.