గూడూరు 2వ పట్టణంలో రక్తదాన శిబిరం

నెల్లూరు: “రక్తం అందక ఒక్క ప్రాణం కూడా పోకూడదు” అన్నది మెగాస్టార్ చిరంజీవి గారి మాట. ఆయన చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకోని రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ తెలిపారు. గూడూరు 2వ పట్టణంలో బుధవారం అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు రవణం స్వామినాయుడు పిలుపు మేరకు జనసేన పార్టీ, మెగాబ్రదర్స్ సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదని, ఇదే సదాశయంతో నిర్విరామంగా కొనసాగుతున్న రక్తదానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఎప్పుడు ముందు ఉంటారన్నారు. అనంతరం మెగాబ్రదర్స్ సేవాసమితి ప్రధాన కార్యదర్శి ఓంకార్ మాట్లాడుతూ ప్రమాదల్లో గాయపడ్డ వారికి మనం చేసే రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు పేరు పేరు నా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవినాష్, శ్రీనాథ్, మణి, చిన్న, వసంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.