‘నా సేన కోసం నా వంతు’కు బొబ్బేపల్లి సురేష్ నాయుడు లక్ష విరాళం
సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా పార్టీకి అండగా లక్ష రూపాయలు చెక్కుని పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో పలు సమస్యలను వారికి తెలియజేయడంతోపాటు రాబోయే ఎన్నికలలో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/jj12-1024x576.jpg)