‘జనంకోసం జనసేన – మహా పాదయాత్ర’ 28వ రోజు

  • నవసమాజ స్థాపనకు పాటుపడే పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు మీ సహకారం అందించండి: ‘బత్తుల’

రాజానగరం, ‘జనంకోసం జనసేన – మహా పాదయాత్ర’ 28వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. నాయకులు బత్తుల బలరామకృష్ణ, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనసేన శ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాలను ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్రం నలుమూలలా ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని, జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహా పాదయాత్రలో అడ్డాల వెంకటేశ్వరరావు, ఉమ్మిడిశెట్టి రామకృష్ణ, ప్రగడ రాజు, ఉమ్మిడిశెట్టి పండు, హరిదాసు వెంకట కృష్ణ, దాసరి రవి, కర్రి మనోహర్, కర్రి సుధాకర్, పప్పల వీరబాబు, కవల అయ్యప్ప, లీల కృష్ణ, లీల సతీష్, సువ్వల లోకేష్, అడ్డాల సత్యనారాయణ, కవల సురేష్, అడ్డాల మణికంఠ, దుర్గా అవినాష్, అడ్డగర్ల మణి, పోతుల మణికంఠ, బొల్లొజు కిషోర్, అడ్డాల అంజి అడ్డాల రామకృష్ణ, దుళ్ళ దుర్గాప్రసాద్, త్రిపురారి సాయి వినయ్, బొల్లెద్దిపాటి యేసు, సుంకర శ్రీను జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.