కిడ్నీ బాధితుడికి అండగా నిలిచిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం 10000/- నగదు పండ్లు మనుబోలు మండలం ముద్ద ముడి గ్రామానికి చెందిన పాలిచేర్ల వెంకయ్య కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి ఇవ్వడం జరిగింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిడ్నీ వ్యాధితో ఎంతో ఇబ్బంది పడుతూ కనీసం కళ్ళు కూడా కనిపించనటువంటి పరిస్థితి.. ముగ్గురు బిడ్డలతో జీవనాన్ని కష్ట సాధ్యంగా కొనసాగిస్తున్నటువంటి పాలిచర్ల వెంకయ్య ఆరు నెలల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకుంటూ.. ఎంతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం గానీ.. ప్రభుత్వ యంత్రాంగం గాని ఆ కుటుంబానికి ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం.
ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతని రెండు కళ్ళు కూడా ఆపరేషన్ చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి ఒక అడుగు ముందుకు వేయాలని జనసేన పార్టీ నుంచి కోరడం జరిగింది. ఈ విషయాన్ని మా అధ్యక్షులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకు వెళ్తాం.. ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునే దానికి మా వంతు మేము సాయి శక్తుల ప్రయత్నిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రహమాన్ భాయ్, పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.