తాసిల్దార్ కి వినతిపత్రమిచ్చిన బొబ్బిలి జనసేన

విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం, రాంభద్రపురం, మండలం పంచాయతీ పరిధిలోని 20 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ కబ్జాదారుడికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారి తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనసేనపార్టీ వారు నిరసన గళం విప్పారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు మొద్దు నిద్రవిడాలి, కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో రాంభద్రపురం మండలం నాయకులు విజయనగరం జిల్లా నిర్వహణ కమిటీ సభ్యులు మహంతి ధనంజయ్, విజయనగరం జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు సంచన గంగాధర్ పారాది ఎంపీటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య, జనసైనికులు చీమల సతీష్, శ్యామ్, మరియు జనసేన పాల్గొన్నారు.