లాల్ బహుదూర్ శాస్త్రిగారు వర్ధంతి సందర్భంగా బొబ్బిలి జనసేన నివాళులు

భారతదేశం రెండవ ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మరియు జనసేన ఐటి విభాగ సభ్యులు శ్రీ గేదెల సతీష్ కుమార్ మరియు జనసేన పార్టీ బొబ్బిలి నాయకులు శ్రీ గంగాధర్, సతీశ్ మరియు సమతం జగదీష్, జనసేన నాయకులు జనసైనికులు ఐదు నిమిషాలు మౌనం పాటిస్తూ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ అని మనసా వాచా నినదించి అస్తవ్యస్తంగా ఉన్న దేశాన్ని గాడిలో పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నించి స్వదేశీ విదేశీ దుష్ట శక్తుల కుట్రలకు, ద్రోహానికి విదేశీ గడ్డ అయిన తాస్కెంట్ (రష్యా) లో ప్రాణాలు కోల్పోయిన భారతరత్న శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతికి నా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతిపురం బలిజిపేట జనసేన పార్టీ నాయకులు బంకురు పోలినాయుడు, రమణ మరియు సైనికులు వచ్చారు.