మంత్రి కొట్టు పై ధ్వజమెత్తిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అయినా కొట్టు సత్యనారాయణ తీరు మారలేదని మంగళవారం కొట్టు సత్యనారాయణ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బొలిశెట్టి శ్రీనివాస్ వారి మాటలను వక్రీకరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం బొలిశెట్టి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. తేతలి గ్రామం వద్ద స్నేహితుల మధ్య ఘర్షణలో తాడేపల్లిగూడెం స్థానిక పాతూరులో వ్యక్తి హత్య కావడం, ఆ ఇరువురు జనసైనికులు అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాస్ అన్నారు. ఇటీవల పెంటపాడు మండలం, లింగారాయుడు గూడెంలో జనసైనికుడు వీరమల్లు ఆదికృష్ణను వైసిపి ఎంపీటీసీ అహంకారంతో కొట్టించాడు. ఈ ఘటనలో ఆదికృష్ణ పది రోజులు హాస్పటల్లో నరకయాతన అనుభవించి చనిపోతే ఆ కేసును పోలీసు వారితో కలిసి పక్కదారి పట్టించడం మీకు తెలియకుండా జరిగిందా అని బొలిశెట్టి అన్నారు. అంతే కాకుండా మీరు చేసే ఇసుక అక్రమణలు, లే అవుట్ అక్రమణలు తాడేపల్లిగూడెం వాసుల దగ్గర అక్రమ దోపిడి మీకు తెలియకుండానే జరుగుతుందా అని బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలిసీ, తెలియని వ్యాఖ్యలను తగ్గించి ఉన్న ఆరు నెలలైనా నిజాయితీగా తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.