కార్యకర్తల ఉగ్రరూపం చూస్తారని హెచ్చరించిన బొలియశెట్టి శ్రీకాంత్

  • జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద హత్యకు కుట్ర పన్నుతున్న వైసీపీ నాయకులు ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్

ఉమ్మడి కృష్ణాజిల్లా కొన్ని నెలలు నుండి జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద హత్యకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జనసేనపార్టీ సభలు సమావేశాలు ఎక్కడికి అక్కడ నిర్వహిస్తుంటే అధినేత పవన్ కళ్యాణ్ సభలు దగ్గర పవన్ కళ్యాణ్ గారిని హతమార్చాలని కొంతమంది వైసీపీ గుండాలు రెక్కీ నిర్వహిస్తున్నారని పదే పదే జనసేనపార్టీ నాయకులు మీడియాలో చెపుతునే ఉన్నారు. అలాగే జనసేనపార్టీ రాష్ట్ర అద్యక్షులు పవన్ కళ్యాణ్ మీద హత్యకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఇంటలిజెన్స్ చెపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రమూ లెక్కచేయడం లేదు. బుధ్వారం జనసేనపార్టీ కార్యాలయం నుండి ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు. హైదరాబాద్ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కొంతమంది రెక్కీ నిర్వహించారు 250 కోట్లు కళ్యాణ్ హత్యకు వైసీపీ నాయకులు డీల్ కుదుర్చుకున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రెస్ ద్వారా తెలియ జేశారు అని జిల్లా ఉపాధ్యక్షులు బొలియసెట్టి శ్రీకాంత్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తున్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ మీద చిన్న గీత పడితే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయిపోతుందని జనసేనపార్టీ నాయకులు గాని కార్యకర్తల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే ముందుగానే ప్రభుత్వనికి, పోలీస్ అధికారులకు చెపుతున్నాం మా నాయకుడు కళ్యాణ్ కి రక్షణ కల్పించాలని కళ్యాణ్ హత్యకు కుట్ర పన్నుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో మా జనసేనపార్టీ కార్యకర్తల ఉగ్రరూపం చూస్తారని ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ ఘాటుగా హెచ్చరించారు.