రుద్రాభిషేకం, లక్ష దీపోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం పట్టణంలో గల కపిల మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వల్లభుని సత్యనారాయణ కుమారుడు హేమంత్ కుమార్ మరియు వారి స్నేహితుడు ద్వారంపూడి రామరాజు రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిలు నిర్వహించిన రుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన మరియు లక్ష దీపోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. అనంతరం ఇంతటి ఘన కార్యం నిర్వహించినందుకు కార్య నిర్వాహకులను ఘనంగా నాయకర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుబ్బల మార్రాజు, పోలిశెట్టి సాంబ, కొణిదల శ్రీనివాసు, గుబ్బల చంటి, కొప్పడి శేఖర్, మాట్ల సూరి, దేశినీడి గంగాధర్, కోట్ల చిరంజీవి, వల్లభుని సత్యనారాయణ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.