అబ్రహం పేటలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర

  • జనంలోకి జనసేన 11వ రోజు

నరసాపురం: జనంలోకి జనసేన 11వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, మొగల్తూరు గ్రామ పంచాయితీ అబ్రహం పేటలో పాదయాత్రగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఇంటింటికీ తిరిగి, జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, వారికి జనసేన తరపున అండగా ఉంతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఈ గ్రామంలో త్రాగునీరు మరియు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు జనసేన తరపున అండగా ఉంతామని నాయకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, నిప్పులేటి తారక రామారావు, గుబ్బల మర్రాజు, దూది బాబు, బొక్క చంటి, బందెల ఎలేషా, నల్లి నాగరాజు, గూడపాటి శ్రీకాంత్, మోటూరి శ్రీను, మోటూరు జైమోషు, ఉప్పులూరు రాంబాబు, అందే దొరబాబు, లక్కు బాబి, వనమాల శ్రీను, ఆయీతం చిన్ని, ముక్కుగిరి, పులపర్తి రాంబాబు, అందే కొండ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.